భక్తవత్సలుండు ఫాలాక్షుఁడా భగీరథుని మెచ్చి నిజశిరంబునందు శౌరిపాదపూత సలిలయై దివి నుండి ధరకు వచ్చు గంగ దాల్చె నపుడు
'భక్తవత్సలుడైన శివుడు ఆ భగీరథుని పూనికను మెచ్చి విష్ణుపాదాలను సోకి పవిత్రమైన జలం కలిగి, ఆకాశం నుంచి భూమి మీదకి ఉరికే గంగను తన శిరస్సుపై ధరించాడు. ' సదాశివుడి పరమకారుణ్యానికి ఈ ఘట్టం మరో నిదర్శనం.అందుకే ఆయన అనేక నామాల్లో గంగాధరుడు అనే పేరు అత్యంత ప్రత్యేకం.
శ్రీరామచంద్రుడి కన్నా పూర్వం ఆ ఇక్ష్వాకువంశంలో జన్మించిన భగీరథుడు ఒకానొక సందర్భంలో, దివిజ గంగను భువికి రప్పించాలని తీవ్రమైన తపస్సు ఆచరించాడు. ఆయన దీక్షకు ప్రసన్నురాలై ఆ సురనది ప్రత్యక్షమైంది. ఆ మహారాజు విన్నపాన్ని మన్నించి ఆ నదీమతల్లి ఈ వసుంధరపై ప్రవహించటానికి అంగీకరించింది. కానీ తన పరవళ్ళ ప్రతాపాన్ని తట్టుకునే శక్తి ఈ పుడమికి ఉందా? అన్న సందేహాన్ని వ్యక్తం చేసింది. స్వర్గలోకం నుంచి దిగివస్తున్నప్పుడు తనను ధరించే ధీశాలి ఎవరని ప్రశ్నించింది. అప్పుడు భగీరథుడు, పరమేశ్వరుడే ఆ పరమపావని ప్రవాహాన్ని భరించగలడని నిర్ణయించుకున్నాడు.ఆ మహేశ్వరుడి కోసం మహాతపస్సు చేశాడు. భక్తవరదుడైన ఆ బోళాశంకరుడు భగీరథుడి తపస్సుకు మెచ్చి సాక్షాత్కరించాడు.దీక్షాపరుడి పట్టుదలకు ప్రసన్నుడై మరుక్షణమే...
Bu hikaye Sri Ramakrishna Prabha dergisinin April 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Sri Ramakrishna Prabha dergisinin April 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద
ఆదిశంకరుల అద్వైతకళాసృష్టి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్
భారతీయ సనాతన సంస్కృతి పునరుద్ధరణలో ఆచార్య శంకరుల పాత్ర అనన్యసామాన్యం, తలనరహితం.
అమ్మంటే అమ్మ...!
అమ్మంటే ప్రేమ... అమ్మంటే త్యాగం... అమ్మంటే సేవ...అమ్మంటే సహనం! ఇన్ని మహనీయ గుణాలు మూర్తీభవించిన ఆమెకు ఆమే సాటి! అమ్మస్థానం హిమగిరిలా అతి మహోన్నతం!
పండుగలు - పర్వదినాలు
పండుగలు - పర్వదినాలు
ఏది గొప్పబలం?
భాగవత ఆణిముత్యాలు - ప్రవ్రాజిక బోధమయప్రాణ
మృత్యుదేవత తలుపు తట్టినపుడు...
నీవు ఎంతో ప్రేమతో నా తలుపు తడతావు... నేను ఎలా స్వాగతం పలుకుతానోనని ఎదురుచూస్తావు....ఎందరిలానో నీ ఆగమనాన్ని నేను అశుభమని భావించను... ఎందుకు అప్పుడే నా తలుపు తడుతున్నావని బాధపడను
పారమార్థిక నిధులు
భగవాన్ శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు - స్వామి బ్రహ్మానందజీ మహరాజ్ శిష్యులైన స్వామి నిర్వాణానందజీ మహరాజ్ రామకృష్ణ సంఘ ఉపాధ్యక్షులుగా సేవలందించారు.
నమో నమో లక్ష్మీనరసింహా!
రూపం మృగనర సమ్మిళితం. హృదయం మహా మృదుల సంభరితం. అసురుల పాలిట కఠినాత్ముడు, ఆశ్రితుల పాలిట కరుణాసాగరుడు... అతడే లక్ష్మీనరసింహుడు.
అడుగు జాడలు...
దివ్యజనని శ్రీశారదాదేవి ప్రత్యక్ష శిష్యులైన స్వామి శారదేశానందజీ (1892-1988) రామకృష్ణ సంఘంలో ఎంతో గౌరవాన్నీ, ప్రేమాభిమానాలనూ చూరగొన్న గొప్ప సన్న్యాసి. ఆయన తపోమయ జీవితం, సేవాదర్శాలు అనేకమంది సాధువులకూ, భక్తులకూ స్ఫూర్తిమంతంగా నిలిచాయి.