Intentar ORO - Gratis
ప్రకృతి రూపం..శక్తి స్వరూపం.
Vaartha-Sunday Magazine
|October 06, 2024
అక్టోబరు 3 నుంచే ఎందుకు మొదలు అంటారా ఎందుకంటే ఆ రోజు ఆశ్వయుజ శుద్ధపాడ్యమి కనుక. అంటే ఈ రోజు అమ్మవారు ఆవిర్భవించిన రోజు గనుక. ఆ రోజునుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు ఆవిడ మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి అతనిని సంహరించింది.
ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తారీకు నుంచి దసరా మొదలుకదా. అక్టోబరు 3 నుంచే ఎందుకు మొదలు అంటారా ఎందుకంటే ఆ రోజు ఆశ్వయుజ శుద్ధపాడ్యమి కనుక. అంటే ఈ రోజు అమ్మవారు ఆవిర్భవించిన రోజు గనుక. ఆ రోజునుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు ఆవిడ మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి అతనిని సంహరించింది.ఈ తొమ్మిది రోజులూ దేవీ నవరాత్రులని అమ్మవారిని పూజిస్తారు. పదవరోజు అమ్మవారు రాక్షసుడిని సంహరించిన విజయోత్సవ వేడుకలు విజయదశమిగా చేసుకుంటారు.
అంటే ఇది శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే పండుగ.అమ్మవారు ఆవిర్భవించింది అంటారు, వెంటనే రాక్షసుడిని చంపిందంటారు.. ఇదేమీ మాకర్థం కావటం లేదు, విపులంగా చెప్పండి అంటున్నారా. మర్చిపోయానర్రా, మీరంతా ఇంగ్లీషు మీడియాలు కదా, తెలుగు కథలు తెలియవులే. సరే, చెప్తా వినండి. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు వుండేవాడు. అతనికి మరణం లేని జీవనం కావాలనీ, ఎల్లకాలం తనే అన్నిలోకాలనూ పరిపాలించాలనీ గొప్ప కోరిక వుండేది. ఈ కాలంలో మనమంతా మంచి ఉద్యోగాలు సంపాదించటానికి బాగా చదివి, పరీక్షలెలా రాస్తున్నామో, ఆ కాలంలో ఏమన్నా సాధించాలంటే ఏళ్ల తరబడి దేవుళ్ల కోసం తపస్సు చేసి వరాలు పొందేవారు. మహిషాసురుడు కూడా తన కోరిక నెరవేర్చుకోవటానికి మేరుపర్వతం మీదకి వెళ్లి అనేక వేల సంవత్స రాలు బ్రహ్మదేవుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. కొన్నివేల సంవత్సరాల తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. మహిషాసురుడు కోరుకున్నాడు. ఏమని? నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని. అప్పుడు బ్రహ్మదేవుడు, 'మహిషాసురా.. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.. గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చటం అసంభవం. కనుక, నిన్ను సంహరించ టానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి, మరే వరమైనా కోరుకో' అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, 'విధాతా.. అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే.. ఆడది నా దృష్టిలో అబల.. ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక, పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా అనుగ్రహించు' అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.
Esta historia es de la edición October 06, 2024 de Vaartha-Sunday Magazine.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
