స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం
Vaartha-Sunday Magazine
|January 19, 2025
మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం
మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం. శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్టించారని ప్రతీతి. దక్షిణ భారతదేశం వచ్చిన శ్రీ అగస్త్య మహాముని తన నిత్య పూజల నిమిత్తం ప్రతిష్టించిన లింగం ఇది. అందుకే స్వామిని ఆయన పేరుతోనే పిలుస్తారు.
తొలి రోజులలో స్వామివారి లింగం మాత్రమే ఉందని అంటారు. అనంతర కాలంలో శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ పార్వతీ అమ్మవారి సన్నిధులు, నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగినట్లు తెలుస్తోంది. కైలాసనాథుడు అర్ధనారీశ్వరుడు. కనుకనే గతంలో మహర్షులు లింగాన్ని మాత్రమే ఆరాధించేవారని అర్ధం చేసుకోవచ్చు.
ఇక్కడ మొదటి ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్నది స్పష్టంగా తెలియదు.కానీ ప్రస్తుత ఆలయ తొలి రూపం చాళుక్య రాజుల కాలంలో జరిగింది అని తెలుస్తోంది. తూర్పు చాళుక్య వంశానికి చెందిన వీరు బాదామీ చాళుక్య రాజులకు దాయాదులుగా చెబుతారు.
తరువాయి కాలంలో వీరు తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజవంశం అయిన చోళులతో వియ్యం చేసుకొన్నారు. వీరిలో ప్రముఖుడు రాజరాజ నరేంద్రుడు. ఈయన కుమారుడు రాజేంద్ర చోళుడు తన మేనమామల తరువాత గంగై కొండ చోళపురం నుండి చోళ రాజ్యాన్ని పాలించాడు. రాజరాజ నరేంద్రుడు నేటి రాజమహేంద్రవరం నిర్మాత. సువిశాల సామ్రాజ్యాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడు మన హిందూ సంస్కృతి నిరంతరం అగ్ర స్థానంలో ఉండటానికి తగిన మార్గం ఆలయాల నిర్మాణ తలంచారు. తమ రాజ్యంలో ఏయే గ్రామాలలో ఆలయాలు లేవు అన్న వివరాలు సేకరించి, క్షేత్ర విశేషాలను ఆధారం చేసుకొని పురాతన విగ్రహాలకు నూతన ఆలయాలు, అదేవిధంగా మరికొన్ని చోట్ల కొత్త ఆలయాలను నిర్మించారని శాసనాలు తెలుపుతున్నాయి.
ప్రతి గ్రామంలో ఒక శివాలయం ఒక విష్ణు ఆలయం నిర్మించారు. నాటి సమాజంలో శైవులకు మరియు వైష్ణవులకు మధ్య ఆధిపత్య పోరు ఉండేది. మధ్యలో జైన, బౌద్ధ మతాల ప్రభావం ఉన్నా అది పెద్ద పరిగణలోకి తీసుకోలేదని అర్ధం అవుతుంది. నేడు మనకు కృష్ణ, గుంటూరు జిల్లాలలో నదీతీరంలో కనిపించే ఆలయాలలో అధిక శాతం వీరి పాలనలోనే అంటే పదకొండవ శతాబ్దంలో నిర్మించినవే కావడం విశేషం.
శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం, కొలకలూరు శివాజ్ఞ మేరకు దక్షిణా పథానికి భార్య లోపాముద్ర, శిష్య ప్రశిష్య గణంతో తరలి వచ్చిన అగస్త్య మహర్షి తాను బస చేసిన ప్రతి ప్రదేశంలో ఒక శివ లింగాన్ని ప్రతిష్టించారని చెబుతారు.
Diese Geschichte stammt aus der January 19, 2025-Ausgabe von Vaartha-Sunday Magazine.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Listen
Translate
Change font size

