శ్రీరాముడు ఒకరోజు ఉద్యానవనంలో సీతను చూసాడు. తండ్రి దశరధుడి ఆదేశంతో విశ్వామిత్రుడి యాగసంరక్షకుడిగా వెళ్లిన సమయంలో ఆ సంఘటన జరిగింది.సీత రూపలావణ్యం, వ్యక్తిత్వం చూసి రాముడు ముగ్ధుడయ్యాడు. సీతను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అదే సమయంలో సీత కూడా శ్రీరాముడిని చూసింది. శక్తి, యుక్తి, శరీర సౌష్టవం, ప్రవర్తన చూసి ముచ్చటపడింది. రాముడే తన భర్తగా రావాలని పార్వతిని ప్రార్థించింది. ఇలా ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. అయితే ఏమాత్రం తొందరపడలేదు. సీత శక్తి సామర్థ్యాలు గుర్తించిన ఆమె తండ్రి తన ఇంటిలో ఉన్న శివధనస్సును ఎక్కుపెట్టిన బలశాలికే సీతను ఇచ్చి వివాహం జరిపిస్తానని అప్పటికే ప్రకటించారు. సీత చిన్ననాటి సంఘటనే దీనికి కారణం. ఆమె ఓ రోజు బంతితో ఆడుకుంటుండగా అది శివధనస్సు కిందకు వెళ్లింది. ఆమె ధనస్సును అలవోకగా పైకి లేపి బంతిని తీసుకున్నది. ఆ దృశ్యాన్ని చూసిన జనకుడు ఆరోజే శివధనస్సును ఎక్కుపెట్టిన యువరాజే తన కూతురికి భర్త కావాలని కోరుకున్నాడు. జనకమహారాజు సీతకు తగిన వరుని కోసం స్వయంవరం ఏర్పాటు చేశారు. శివధనస్సు విరిచిన వారికే సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు.లంకాధీశుడు రావణుడు సహా పలువురు స్వయం వరానికి వచ్చారు. రాముడు మాత్రమే శివధనస్సును ఎక్కుపెట్టి, సందించి విరిచాడు. దీంతో సీత ఆనందానికి అంతులేకుండా పోయింది.తను కోరుకున్న వాడే తనకు తగిన భర్తని, ఆయనే తనను జీవితకాలం రక్షించగలడని భావించింది.స్వయంవరంలో రాముడిని సీత వరించడంతో జనకుడు తన కుమార్తె సీతను వివాహం చేసుకోవాలని రాముడిని కోరాడు.అయితే దీనికి తన తండ్రి దశరథుడి అనుమతి అవసరం అని రాముడు చెప్పాడు. తాను తండ్రి ఆదేశంతో యాగసంరక్షకుడిగా వచ్చానని వివరించాడు యజ్ఞానికి వచ్చిన తనను ఆహ్వానించడం తో స్వయంవరానికి వచ్చానని తెలిపాడు. తండ్రి అనుమతి తీసుకున్న తర్వాతే సీతను వివాహం చేసుకుంటానని చెప్పాడు.పెళ్లికి తండ్రి అనుమతి కావాలని రాముడు చెప్పడంతో ఆయనపై సీతకు మరింత గౌరవం,ప్రేమ పెరిగింది. అత్తవారింట్లో లభించాల్సిన గౌరవం, మర్యాద, భద్రత కోసం రాముడు అలాంటి నిర్ణయం తీసుకున్నాడని భావించింది. తర్వాత వారి జీవితం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. రావణుడు సీతను అపహరిస్తాడు. ఆఖరికి రాముడి చేతిలో మరణిస్తాడు. సీతారాముల ప్రేమ ఆదర్శంగా నిలిచింది. శూర్పణఖ, రావణుడు వ్యామోహం పతనానికి దారితీసింది.
Esta historia es de la edición February 11, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 11, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
19 మే నుండి 25, 2024 వరకు
వారఫలం
సెల్లార్ పైకప్పు ఎంత ఎత్తులో ఉండాలి?
వాస్తువార్త
అజ్ఞానం ఎంత అదృష్టమో!
'అడిగేవాడికి చెప్పేవాడు లోకువ\" అన్నారు.'ప్రశ్నలు అడగడంలోని ఆనందం సౌలభ్యం, సమాధానాలు చెప్పడంలో వుండదు.
ఆంధ్రాలో చూడదగ్గ స్థలాలు
ఆంద్రప్రదేశ్ పురాతత్వ స్థలంగా ప్రసిద్ధి చెందిన జ్వాలాపురం గ్రామం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉంది. జ్వాలాపురం చుట్టుపక్కల సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో పురాతత్వ స్థలాలు విస్తరించి ఉన్నాయి
సింగిల్ పేజీ కథ
ఈ రోజు నాన్నగారి శత జయంతి. పొద్దుటే గుడికెళ్లి పూజ చేయించి ఇంటికొచ్చాక కాఫీ తాగుతూ సెల్ ఫోన్లో వాట్సప్ సందేశాలు చూస్తూ కూర్చున్నాను.
ధర్మసంకటం
“నా కు వేదిక ఎక్కి మాట్లాడాలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు సార్, అయినా ఉన్నట్టుండి ఈయన నాలుగు \" మాటలు మాట్లాడుతారు అని చెప్పేసారండి\" ఓ కార్యక్రమ నిర్వాహకుడు.
కడగండ్ల కడలిలో తెలుగు
ప్రాచీన కాలం నుండి వింధ్య పర్వత శ్రేణికి దక్షిణంగా వ్యాపించిన జాతి తెనుగువారు.
మోంటానాలోని రో నది ప్రత్యేకత
అమెరికాలోని మోంటానాలో రో నది కేవలం 201 అడుగుల దూరం మాత్రమే ప్రవహిస్తుంది.