Poging GOUD - Vrij
బక్కచిక్కుతున్న జీవ వైవిధ్యం
Vaartha-Sunday Magazine
|August 20, 2023
ఈ విశ్వంలో మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ ఆధారాలతో సహా నిరూపించింది.
-
ఈ విశ్వంలో మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ ఆధారాలతో సహా నిరూపించింది. అయితే మనిషి ఆవిర్భావం తరువాత మనిషి కంటే ముందే వచ్చిన చాలా జంతువుల జాడ ఇప్పుడు కానరావడం లేదు. కొన్ని జంతువులు అంతరించిపో యాయి. కొన్ని అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ భూమి పై జీవించడానికి మానవులు మనుగడ సాగించడానికి ఎంత హక్కు ఉందో అలాగే జంతువులకు కూడా అదే హక్కు ఉంది.మూగజీవాలు అయినంత మాత్రాన వాటికి హక్కులు లేకపో లేదు. సృష్టి నిర్మాణంలోనే జీవ వైవిధ్యం పాటిస్తూ ఒక్కో జీవికి ఒక్కో రకమైన ఆహారాన్ని ఆవాసాన్ని ప్రకృతిలో ఏర్పాటు జరిగిం ది. జంతువులు, పక్షులు, జలచరాలు.. ఇలా అనేకం భూమిపై ఆకాశంలో, నీటిలో జీవనం సాగించే ఏర్పాటు ప్రకృతిలోనే జరిగింది. ఈ సందర్భంలో మానవుడు మచ్చిక చేసుకోవడానికి వీలులేని జంతువులకు ఆవాసాలుగా అడవులను ఏర్పాటు జరిగింది. వీటినే వన్యప్రాణులు అంటారు. వీటికి ప్రత్యేక ఆవాసం ఉంది. మానవుల ఆవాసాలు లోనికి అవి రావు. కానీ మానవుడు మాత్రం వాటి ఆవాసాలలోనికి చొచ్చుకుపోతున్నాడు.వాటికి హాని తలపెడుతున్నాడు. జంతువులు లేనిదే ప్రకృతి లేదు. ప్రకృతి లేనిదే మానవుడు లేడు. ఒకసారి ఒక జాతి అంతరించిపోయింది అంటే ఎట్టి పరిస్థితులలో అట్లాంటి జాతిని పుట్టించడం అసాధ్యం. అయితే ఈ సత్యాన్ని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఈ పరిస్థితి ముందుగానే గ్రహించిన మన సాంప్రదాయాలు జంతువులను దైవ స్వరూపాలుగా చెప్పిన ప్పటికీ కూడా వాటిని వదిలిపెట్టడం లేదు. ఈ సమస్త ప్రకృతి లో ప్రతి ప్రాణికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. జీవించే హక్కు ఉంది. మనతో పాటు లక్షలాది పక్షులు, జంతువులు, క్రిమికీటకాలు జీవిస్తున్నాయి. ప్రతి జీవి సృష్టిలోను ఒక అంతరార్థం ఉంది. వాటికి నష్టం జరిగితే ఆ నష్టాన్ని వేరే ఏ జాతి కూడా దానిని భర్తీ చేయలేదు అనే సత్యాన్ని మానవ జాతి విస్మరిస్తుంది. వాటి ఆవాసాలకు మానవ జాతి తీవ్ర నష్టం చేస్తూ ఉంది.ప్రకృతి సృష్టించిన జంతుజాలం అంతా క్షేమంగా ఉన్నప్పుడే ఈ ప్రకృతిలో సమతౌల్యం ఉంటుంది.ప్రస్తుతం ఆ సమతౌల్యం లోపించింది అని స్పష్టంగా మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అయినా మనలో పరివర్తన కనిపించడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న మన అవసరాలు, అంతకన్నా ముఖ్యంగా అవసరానికి మించిన వనరులు వాడకం పర్యావరణ కాలుష్యా నికి కారణమై ఇది పరోక్షంగా వన్యప్రాణు ల మీద, పక్షుల మీద, జల చరాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంది. ఒక పక్క మానవ ప్రమేయంతో ఖని
Dit verhaal komt uit de August 20, 2023-editie van Vaartha-Sunday Magazine.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
వింత విహంగాలు
అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
వార్త ఆదివారం
బాలగేయం
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
గిరీష్ అంకుల్ సమాధానాలు
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
నా ప్రతిబింబం ఆగిపోయింది
నా ప్రతిబింబం ఆగిపోయింది
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?
వాస్తు వార్త
1 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
సైకిల్ కథా కమామిషూ..
సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
ఈ వారం కార్ట్యూంస్
ఈ వారం కార్ట్యూంస్
1 min
November 30, 2025
Vaartha-Sunday Magazine
వరప్రదాయక వినాయకుల ఆలయం
ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.
3 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు
వారఫలం
2 mins
November 30, 2025
Vaartha-Sunday Magazine
తరాల మధ్య వారధి
తరాల మధ్య వారధి
1 min
November 30, 2025
Translate
Change font size
