తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజున తలపెట్టిన 'తెలంగాణ హరితోత్సవం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరు రిజర్వు ఫారెస్ట్ కేంద్రంలో ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు. ప్రగతి భవన్ నుంచి తుమ్మలూరు రిజర్వ్ ఫారెస్ట్ చేరుకున్న సీఎం కేసీఆర్, అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం ద్వారా ప్రయాణిస్తూ అటవీ అభివృద్ధి పనులను పరిశీలించారు. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పట్టణాల్లో హరిత ప్రగతిని వివరించే ఫోటోలను, నివేదికలను ఈ సందర్భంగా ప్రదర్శించిన అటవీశాఖ అధికారులు వాటి గురించి సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మొక్కలు నాటి పెంచే కార్యక్రమాల పురోగతిని ఈ సందర్భంగా అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎం ఓఎసి ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ డోబ్రియాల్ తదితరులు సీఎం కేసీఆర్కు వివరించారు. సబంధిత అంశాల గురించి తెలుసుకుంటూ, వివరిస్తూ, చర్చిస్తూ సీఎం కేసీఆర్ ముందుకు సాగారు. వన్యమృగాలు, అడవి జంతువుల నుంచి స్వీయ సంరక్షణ, పంటల రక్షణలో భాగంగా వినియోగించే ఆయుధాలు, రక్షణ పరికరాలు, వ్యవస్థల ప్రదర్శనను సీఎం పరిశీలించారు. అనంతరం అక్కడే మహాగని మొక్కను మంత్రులు, ఎమ్మెల్సీలు, ంపీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం నాటారు.
"తెలంగాణ పచ్చబడ్డది. ఏడెనిమిది ఏండ్ల నుండి మనందరం పట్టుబట్టి, జట్టుకట్టి బీడుబారి పోయిన తెలంగాణను ఒక తొవ్వకు తెచ్చుకుంటున్నాం. తెలంగాణ పచ్చబడడానికి సంకేతంగా రెండు మూడు కారణాలున్నాయి. ఒకటి ధాన్యం ఉత్పత్తిలో 2014లో మనం పదిహేను, పదహారవ స్థానంలో ఉన్నాం. రెండు, భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రావడం చాలా సంతోషాన్ని కలిగించింది.దీంతో పాటు అనేక రంగాల్లో మనం నెంబర్ వన్ వెలుగొందుతున్నాం.
Esta historia es de la edición July 2023 de Telangana Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 2023 de Telangana Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
జల సంరక్షణలో పురస్కారాలు
ముల్కలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యల్లో, జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం చేసుకుంది.
పేదల మేడలు కొల్లూరు గృహాలు
సంగారెడ్డిజిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 15,660 గృహాలు కలిగిన, ఆసియాలోనే అతి పెద్ద సామాజిక గృహ వసతి సముదాయాన్ని (టౌన్ షిప్) రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించారు.
సకల జనహితంగా 'విప్రహిత'
బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మెట్టమొదటిసారిగా గోపనపల్లిలో నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా ఘనంగా జరిగింది.
తెలంగాణ పచ్చబడ్డది
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజున తలపెట్టిన 'తెలంగాణ హరితోత్సవం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు.
సిద్ధిపేటకు ఐటీ టవర్
సిద్ధిపేట యువతీ, యువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది.
రాష్ట్రానికి ఐదు 'గ్రీన్ యాపిల్' అవార్డులు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలోనే రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి
నిమ్స్ దశాబ్ది భవనం
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.
మన గడ్డపై కోచ్ల తయారీ
రాష్ట్రంలో అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్ళను తెలంగాణ బిడ్డలు తయారుచేయడం గర్వకారణమని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు
- హరితనిధి ఒక నవీన ఆలోచన:
ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
కంటి వెలుగు శతదినోత్సవం'
వంద రోజుల 'కంటి వెలుగు' సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు.