ఆరోగ్యంగా ఉండాలంటే మనకు సూర్యరశ్మి కావాల్సిందే. అంటే మన మాటల్లో చెప్పాలంటే మన శరీరానికి ఎండ తగలాల్సిందే. ఎండ లేదా సూర్యరశ్మి శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే ఎక్కువసేపు ఎండలో కూర్చోవడం వల్ల చర్మానికి అనేక రకాల నష్టం వాటిల్లుతుందని గుర్తుంచుకోండి.
వాస్తవానికి సూర్యుడు అతి నీలలోహిత కిరణాలను విడుదల చేస్తాడు. ఈ కిరణాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇవి శరీరంలో విటమిన్ 'డి'ని ఉత్పత్తి చేస్తాయి.
ఎముకలను బలోపేతం చేస్తాయి, అయితే ఈ కిరణాలతో కొన్ని చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. యూవీ కిరణాలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి యూవీఏ, రెండవ రకం యూవీబి.
యూవీఏతోపాటు యూవీబీ కిరణాలు, రెండూ చర్మానికి హాని కలిగిస్తాయి.యూవీఏ కిరణాలు చర్మం లోతైన పొరలను ప్రభావితం చేస్తే యూవీబీ కిరణాలు చర్మం ఉపరితల పొరలను ప్రభావితం చేస్తాయి. చర్మంపై యూవీ సూర్య కిరణాలు పడటం వల్ల అనేక ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి.
ఎక్కువసేపు సూర్యరశ్మి మన శరీరంపై సోకినప్పుడు చర్మం కమిలి పోయినట్లుగా దాని రంగు మారుతుంది. చర్మం కాలినట్లు కనిపిస్తుంది.నల్లగా మారడం ప్రారంభమవుతుంది. చర్మంపై ముదురు రంగు పాచెస్ కనిపించవచ్చు. ఇవి పోవాలంటే తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలి. ఎండ తగలడం వల్ల ముఖంలోని మెరుపు వెళ్లి పోతుంది. అంతేకాదు ముఖంపై మచ్చలు కనిపించవచ్చు.
వడదెబ్బ : సూర్యరశ్మి లేదా ఎక్కువసేపు ఎండలో తిరగటం వల్ల చర్మంపై బొబ్బలు వస్తాయి. ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. ఇవి దురదను పుట్టిస్తాయి. దీనినే సన్బర్న్ అంటారు. ఒక్కొక్క సారి వడదెబ్బ వల్ల శరీరంలో నీరు తక్కువవడంతో పాటు కళ్లు తిరగటం. స్పృహ కోల్పోవడం. విరోచనాలు కావడం, ప్రాణాలు పోవడం కూడా జరుగుతుంది.
వృద్ధాప్యం: చర్మం కింద ఉండే కొల్లాజెన్, ఎలాస్టిన్లు దెబ్బ తినడం లేదా తగ్గడం వల్ల చర్మం వృద్ధాప్యం వచ్చినట్లుగా కుంచించుకుపోతుంది. దీని కారణంగా గీతలు, ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి. యూవీ కిరణాలు కొల్లాజెన్, ఎలాస్టిన్ స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తాయి.
Bu hikaye Grihshobha - Telugu dergisinin April 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin April 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.