ఉద్యోగం పురుష లక్షణం అన్నారు మన పెద్దలు.కానీ మారిన కాల మాన పరిస్థితుల ప్రకారం ఉద్యోగం చేయడం అబ్బాయిలకు ఎంత ముఖ్యమో అమ్మాయిలకూ అంతే ముఖ్యం.నేటి పరిస్థితుల్లో అమ్మాయిలు, అబ్బాయిల కన్నా తక్కువ జీతానికి ఉద్యోగాలు చేయాలా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. దీనికి అవుననే అంటున్నారు. అమ్మాయిలు తమ విద్యార్హతల కంటే తక్కువ ఉద్యోగం వచ్చినా వెంటనే చేరిపోవాలి.చాలామంది అమ్మాయిలు తక్కువ జీతం వచ్చే ఉద్యోగాల్లో చేరరు.ఎందుకంటే తమ పరువు పోతుందని అనుకుంటారు. జీతం తక్కువగా ఉద్యోగాలు వచ్చినా, వాటిలో చేరకుండా వదిలేసి ఇంట్లోనే ఉంటున్నారు. ఇది పూర్తిగా తప్పు.
ఇలాంటి ఉద్యోగాలు చేయడం వల్ల ఆడపిల్లలు కనీసం పాకెట్ మనీ అయినా సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా వారు తమకు బయటి ప్రపంచం గురించి తెలుసుకునే ఏకైక ఆసరా ఉద్యోగమని అర్థం చేసుకోవాలి.మరో లాభం ఏమంటే ఉద్యోగం వల్ల జీవితంలో కొత్త అనుభవాలు ఎదురైతాయి.
బతకటానికి సరిపోని జీతం లేని ఉద్యోగం ఏమిటి అని ఎవరైనా అన్నా, ఆఫీసు రాకపోకలకే ఆ జీతం సరిపోతుందని అన్నా దాన్ని పట్టించుకోవద్దు.
ఆ ఉద్యోగం చేస్తూనే మరో ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు. ఈ అనుభవం అక్కడ పనికి రావచ్చు. ఆడపిల్లలను ఉద్యోగం చేయవద్దని చెప్పే వారు ఆడవారి పురోగతిని కోరుకోలేరు.
వారి ఆలోచనలను తిప్పి కొట్టాలి
వాస్తవానికి అలాంటి వ్యక్తులు అమ్మాయిలు ఎప్పుడూ అబ్బాయిల కంటే వెనుకబడి ఉండాలని, వాళ్లను ఆపాలని కోరుకుంటారు. అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా భుజం భుజం కలిపి నడవడం వాళ్లు సహించరు. దీని వెనుక కారణం వారి సంప్రదాయవాద ఆలోచనలే. అమ్మాయిలు ఈ ఆలోచనలను ఎదిరించి అవి తప్పని నిరూపించాలి. ఏ విషయంలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువ కాదని చెప్పాలి.ఇందుకోసం అమ్మాయిలు ఏ ఉద్యోగం వచ్చినా చేయాలి.
మత ఆచారాలంటూ ఆడపిల్లలను అడ్డుకునే ప్రయత్నం చేసే వారు సమాజంలో చాలామంది ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు వారి మాట వినకూడదు. ఆడ పిల్లలను ఇంటి నాలుగు గోడల మధ్య ఉంచడానికే మతం ఏర్పడిందని, మత పెద్దలని చెప్పుకునే వారు ఆడపిల్లలను ఇంటి నుంచి బయట అడుగుపెట్టడానికి అస్సలు అంగీకరించరు.
ఎందుకంటే అలా తమ చేయడంతో అమ్మాయిలు హక్కులను తెలుసు కుంటారని,మతం వారిని నియంత్రించ టానికి మాత్రమే ఏర్పడిందని వారు వాదిస్తారు.
Bu hikaye Grihshobha - Telugu dergisinin April 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin April 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.