ఒకవైపు సైన్సుని ఉపయోగిస్తూ ప్రగతి సాధిస్తూనే మరోవైపు మూఢ నమ్మకాలు, దురాచారాలతో మన ఆలోచనల్ని మరింత సంకుచితంగా మార్చేస్తున్నాము...
నే ను పురుషుడిని అయినందున మహిళలకు వచ్చే రుతుచక్రం గురించి ఎలాంటి భయం లేదు.కానీ మా అక్కకి జరిగిన 2 సంఘటనలు నా మనసును కుదిపేయటమేగాక స్త్రీలపైన శ్రద్ధ మరింత పెంచాయి.
మా అక్క నా కంటే 5 ఏళ్లు పెద్ద. ఆమె పదో తరగతిలో ఉన్నప్పుడు ఒక రోజు హఠాత్తుగా స్కూలు నుంచి ఇంటికి వచ్చేసింది. ఆమె ముఖంలో రంగు మారిపోయింది. తన కుర్తా వెనుక భాగంలో రక్తపు మరకలున్నాయి. నీళ్లతో కడగటం వల్ల డ్రెస్సు అంతా తడిసిపోయింది.ఏమిటని అడిగితే మాట దాట వేసింది, కానీ అమ్మ నన్ను మందలించి నోర్మూయించింది.
పెద్దయ్యాక నిదానంగా నేను తెలుసుకున్నాను. ఆ రోజు అక్కకు ఏం జరిగిందో అర్థమైంది. ఆ పరిస్థితిని తలచుకుని ఇప్పటికీ వణుకుతుంటాను.
బాల్యంలోని మరో ఘటన గుర్తొస్తోంది.మా అక్క పెళ్లయ్యాక తొలిసారి నేను వారింటికి వెళ్లాను. ఉదయం అక్క నేలపై పడుకొని ఉంది.బావ మంచంమీద ఉన్నాడు. దీని గురించి అక్కని అడిగితే ఆమె సింపుల్గా స్త్రీలకు రుతుచక్రం వచ్చినప్పుడు దూరంగా ఉంచుతారు, కనుక నేలపై పడుకోవాలి అంది.
ఆ సమయంలో తన మాటలు ఎంతో విడ్డూరంగా అనిపించాయి. కానీ నేను మాత్రం ఏమి చేయగలను. అందుకే మౌనం వహించాను.ఇప్పుడైతే పెద్దయ్యాను. కనుక దీని గురించి రాసి మూఢనమ్మకాల్ని సమాప్తం చేయాలి అనుకున్నాను. అందుకే ఈ వ్యాసాన్ని ఇలా మీ ముందుకు తెస్తున్నాను.
సామాన్య ప్రక్రియ
జీవిత చక్రంలో ప్రతి మహిళ నెలసరిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది చాలా సాధారణ ప్రక్రియ. కానీ ధార్మికంగా ఈ విషయంలో మహిళల్ని అపవిత్రులుగా చూస్తుంటారు.
రుతుచక్రం వల్ల మహిళ అంటరానిదే అనుకుంటే ఈ ప్రపంచంలోని స్త్రీ పురుషులందరూ అపవిత్రులే. ఎందుకంటే పుట్టేటప్పుడు ప్రతి శిశువు అదే రక్తంతో తడిసి ఉంటుంది.
ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే నెలసరి సమయంలో స్త్రీని తన నుంచి వేరుగా ఉంచటం పురుషుని మిథ్యా అహంకారాన్ని పెంచుతుంది.ఇంతకు మించి ఏమీ ఉండదు. దీనికి చాలావరకు హైందవ పురాణాలు కారణమవుతాయి.పురాణాల్లోని ఒక కథ ప్రకారం ఇంద్రుడు తన పాపాల్లో భాగాన్ని స్త్రీలకు ఇచ్చాడట. దీనివల్లే మహిళలకి ప్రతి నెల నెలసరి బాధ ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
హార్మోన్స్లో మార్పులు
This story is from the May 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.