రోజులాగే ఆరోజు కూడా పొద్దున్నే పొలం చుట్టొచ్చిన పరంధామయ్య కాలకృత్యాలు ముగించుకొని, పూజ గదిలోకి వెళ్లాడు. అప్పటికే పూజకవసరమైన సామగ్రిని సిద్ధంగా వుంచింది ఆయన భార్య దమయంతి. ఓ అరగంటకుగానీ ఆయన పూజ గదిలోంచి బయటకు రాడు. ఆ తర్వాతగానీ ఆహారం తీసుకోడు. అది అతని దినచర్య.
రాఘవాపురంలో గ్రామ పెద్దగా పది మందిలో మంచి పేరుంది.పరంధామయ్యకు. దైవభక్తి, దాన గుణం ఆయన ప్రత్యేకతలు. తనకున్న దానిలో నలుగురికి అంతో యింతో సాయం చేసేవాడు. చుట్టుపక్కల గ్రామాలలో కూడా పరంధామయ్య గురించి తెలుసుకున్నవారు ఎప్పుడైనా కష్టాల్లో వుంటే వచ్చి ఆయన దగ్గర సాయం పొందేవారు.ముఖ్యంగా ఆయన అనాథాశ్రమాలకు అంటే వెనకా ముందూ చూడకుండానే విరాళాలు యిచ్చేవాడు. దానికి కారణం లేకపోలేదు. పెద్దలు సంపాదించి - యిచ్చిన ఆస్తిని తన కష్టంతో మరింత పెంచాడు. ఆస్తి అయితే పెరిగింది కానీ దానిని తినటానికి వారసులు పుట్టలేదు.పిల్లల కోసం ఎంతో తాపత్రయపడ్డారు.గుడులు, గుట్టలు తిరిగారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో విసుగొచ్చి మానుకున్నాడు. మరో పెళ్లి చేసుకోమని బంధుమిత్రులు చెప్పారు. దమయంతి కూడా రెండో పెళ్లికి అడ్డు చెప్పలేదు.అయినా పరంధామయ్య ఏమాత్రం తలొగ్గలేదు.
"పోనీ... పెంచుకోడానికి ఓ బిడ్డను తెచ్చుకుందామండీ!" దమయంతి ఉండబట్టలేక అడిగిందో రోజు.
"లేదు దమయంతీ.. యెవరో ఒకరిని పెంచుకుంటే ఆ బిడ్డ కోసం వుంచాలనే స్వార్థంతో సంపాదనను ఇతర అనాథ పిల్లలకు దానం చేయలేం. ఒక అనాథని పెంచి పెద్ద చేయడం కన్నా పది మందికి సాయపడటం బాగుంటుందనేది నా ఉద్దేశం" చెప్పాడు పరంధామయ్య.
భర్త నిర్ణయాన్ని కాదనలేక "అలాగేనండీ... మీ యిష్టం" అంది.
అప్పటి నుండి ఏ అనాథాశ్రమంవారు.వచ్చి విరాళం అంటే కాదనడు.తోచినంత యిచ్చి పంపటం పరిపాటి అయిపోయింది. అనాథ బాలలు అన్నఅతని సెంటిమెంట్ తెలిసినవారు అప్పుడప్పుడూ వచ్చి అంతో యింతో విరాళాలు పట్టుకుపోయేవారు.
"ఏవండీ!" బయట పిలుపు విని వంటగదిలో పనిలో వున్న దమయంతి వచ్చి తలుపు తెరిచింది.
బయట ఒక కాషాయాంబరధారి, ఆ వెనుక నలుగురు వ్యక్తులు వున్నారు. పొద్దున్నే ఎవరో చందాకొచ్చారనే విషయం అర్థం చేసుకున్న ఆమె “వారు పూజలో వున్నారు" అంది.
“పర్లేదమ్మా.. వారు వచ్చేదాకా వుంటాం" వారిలో ఒకతను చెప్పాడు.
"అలాగే.." అని కొట్టం వైపు చూసి "రంగా.. యిలా వచ్చి ఆ హాల్లోని కుర్చీలు వరండాలో వెయ్" అంది.
This story is from the March 10, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 10, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
19 మే నుండి 25, 2024 వరకు
వారఫలం
సెల్లార్ పైకప్పు ఎంత ఎత్తులో ఉండాలి?
వాస్తువార్త
అజ్ఞానం ఎంత అదృష్టమో!
'అడిగేవాడికి చెప్పేవాడు లోకువ\" అన్నారు.'ప్రశ్నలు అడగడంలోని ఆనందం సౌలభ్యం, సమాధానాలు చెప్పడంలో వుండదు.
ఆంధ్రాలో చూడదగ్గ స్థలాలు
ఆంద్రప్రదేశ్ పురాతత్వ స్థలంగా ప్రసిద్ధి చెందిన జ్వాలాపురం గ్రామం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉంది. జ్వాలాపురం చుట్టుపక్కల సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో పురాతత్వ స్థలాలు విస్తరించి ఉన్నాయి
సింగిల్ పేజీ కథ
ఈ రోజు నాన్నగారి శత జయంతి. పొద్దుటే గుడికెళ్లి పూజ చేయించి ఇంటికొచ్చాక కాఫీ తాగుతూ సెల్ ఫోన్లో వాట్సప్ సందేశాలు చూస్తూ కూర్చున్నాను.
ధర్మసంకటం
“నా కు వేదిక ఎక్కి మాట్లాడాలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు సార్, అయినా ఉన్నట్టుండి ఈయన నాలుగు \" మాటలు మాట్లాడుతారు అని చెప్పేసారండి\" ఓ కార్యక్రమ నిర్వాహకుడు.
కడగండ్ల కడలిలో తెలుగు
ప్రాచీన కాలం నుండి వింధ్య పర్వత శ్రేణికి దక్షిణంగా వ్యాపించిన జాతి తెనుగువారు.
మోంటానాలోని రో నది ప్రత్యేకత
అమెరికాలోని మోంటానాలో రో నది కేవలం 201 అడుగుల దూరం మాత్రమే ప్రవహిస్తుంది.