కోస్గి సభలో సిఎం రేవంత్ హామీ
మహబూబ్ నగర్ బ్యూరో, ఫిబ్రవరి 21, ప్రభాతవార్త: ఎన్నికల యుద్ధం విరామం మాత్రమే అని, రాష్ట్రంలోని 17పార్లమెంట్ స్థానాలకు 14 స్థానాల్లో విజయం సాధిస్తేనే గెలిచినట్లు అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి పాలమూరుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, పాలమూరు ఎండబెట్టారని దుయ్యబట్టారు. నారాయణపేట జిల్లా కోస్గి పర్యటనలో భాగంగా రూ.4400 కోట్ల అభివృద్ధిపనులకు శంకుస్థాపనచేసిన అనంతరం సాయంత్రం కోస్గి బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచి ప్రజల మహిళాసంఘాలతో సమావేశం నిర్వహించారు. అనంతరం అభిమానం గుండెల నిండా ఉన్నందుకే నేడు సీఎంగా తిరిగి వచ్చానని చెప్పారు. పాలమూరు ఆదరించి, ఆశీర్వదించి అక్కున చేర్చుకున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ కరీంనగర్లో నిలబడితే ఓడిపోతాననే భయంతో నాడు అక్కడి నుంచి పాలమూరుకు వలస వస్తే మహబూబ్ నగర్ నుంచి మనం గెలిపించి ఆదరిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభించి కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టబెట్టి ఒక్క ఎకరాకైన నీళ్లివ్వలేదన్నారు. పాలమూరు గడ్డకు, ఇక్కడి బిడ్డలకు క్షమాపణ చెప్పి మళ్లీ ఇక్కడ అడుగు పెట్టాలని, ఓటు అడగాలని డిమాండ్ చేశారు. నమ్మించి నట్టేట ముంచాడని దుయ్యబట్టారు.ఆనాడు చిన్నారెడ్డి ప్రారంభించిన తెలంగాణ ఉద్యంమంలోకి చీమలు పెట్టిన పుట్టలోకి పాములు జొర్రినట్లు ఉద్యమంలో వచ్చి తెలంగాణను పట్టిపీడించాడని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా ఏ మొఖం పెట్టుకొని మళ్లీ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరులో 14అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల్టో బీఆర్ఎస్ అభ్యర్థులను బండకేసి కొట్టినా బుద్ధిరాలేదన్నారు. భీమా, కోయిల్సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, దేవాదుల, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేశావో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 2లక్షల కోట్టు ప్రాజెక్టులకు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు.
この記事は Vaartha の February 22, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Vaartha の February 22, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
కెసిఆర్కు సిఎం ఆహ్వానం
జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది.
ఆహారం తింటే వాంతులే!
బూజుపట్టిన చికెన్, ఫంగస్ సోకిన కూరగాయలు హనుమకొండలో కూడా అదే దారుణం హోటళ్లపై విస్తృతంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
నకిలీ విత్తులపై భారీ వల
వివిధ జిల్లాల్లో విత్తనాల షాపులపై ఆకస్మిక దాడులు రంగంలోకి పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ టాస్క్ ఫోర్స్ బృందాలు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: అధికారుల హెచ్చరిక
రూ. 700 కోట్ల గొర్రెల గోల్మాల్ మరో ఇద్దరి అరెస్టు
విశ్రాంత సిఇఒ, తలసాని మాజీ ఒఎస్టి కల్యాణ్ కుమార్ చంచల్గూడ జైలుకు తరలింపు త్వరలో మరికొందరి అరెస్టుకు అవకాశం
టీ 20 వరల్డ్ కప్ వార్మప్ వెస్టిండీస్ గెలుపు E
ఐసిసి టి 20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్లో విండిస్ ఆస్ట్రేలియాపై 35 పరుగుల తేడాతో విజయం సాధించిది.
నేటి నుంచి మారనున్న రూల్స్
నేటి నుంచి జూన్ నెల ప్రారంభమైంది. అయితే ఆధార్, అప్డేట్, ఎల్పిజి సిలిండర్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి పలు మార్పులు కనిపిస్తాయి.
భారత్ ఆర్థికవృద్ధి 8.2 శాతం
ఆర్బీఐ అంచనాలు అధిగమించిన జిడిపి వృద్ధి కీలక ఎనిమిది రంగాల్లో వృద్ధి 6.2%
విమానానికి బాంబు బెదరింపు
శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్ర యంలో కార్యకలాపాలకు అంతరాయం కలి గించింది.
బక్రీద్ ఏర్పాట్లపై నగర కొత్వాల్ సమీక్ష
వచ్చే నెల 17వ తేదీన జరగనున్న బక్రీద్క సంబంధించిన ఏర్పాట్లపై సిటీ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం బంజా రాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్లో గల తన కార్యాలయంలో సమీక్షిం చారు.
హైదరాబాద్ 7, 8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సు
ప్రపంచ వరి సదస్సు ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్లో జరుగుతుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు.