చంపకవనం మహారాజు షేర్ సింగ్ ప్రతి సంవత్సరంలాగానే ఈసారి నూతన సంవత్సరానికి ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు.దాని గురించి చాలా ఆలోచించారు. కానీ ఎలాంటి ప్రత్యేక ఐడియా రాలేదు.
అందుకే అతడు తన మంత్రి జెన్నా నక్కను పిలిచి “మంత్రిగారూ, నేను నూతన సంవత్సరం కోసం కొత్తగా, ప్రత్యేకంగా ఉండేది ఏదైనా చేయాలనుకుంటున్నాను. కానీ ఏదీ ఆలోచించలేకపోతున్నాను. ఒక ఐడియా చెప్పి నాకు సహాయం చేయగలరా?” అని అడిగాడు.
మంత్రి కొద్దిసేపు ఆలోచించి “నాకు ఒక ఆలోచన ఉంది. కానీ మహారాజా, అది మీకు నచ్చదని భయపడుతున్నాను” అన్నాడు.
“బాధపడకండి, చెప్పండి, మీరు ఏం ఆలోచిస్తున్నారు?” “మహారాజా, నా ఆలోచనతో ముందుకు వెళితే, మీరు ఒక రోజు సింహాసనం నుంచి దిగిపోవాలి.”
మహారాజు ఆశ్చర్యపోయారు. “అదెలా మంత్రిగారూ, నాకు నా సింహాసనం ఎంత ఇష్టమో మీకు తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా నేను రాజుగా ఉన్నాను.”
జెన్నా ఇంకేమీ చెప్పలేదు. మహారాజు ఆలోచనలో పడ్డారు.
కొద్దిపేపటి తర్వాత “అలాగే మంత్రిగారూ, మీ ఐడియా చెప్పండి. నేను నా ఇష్టమైన సింహాసనాన్ని ఒక రోజు విడిచి పెట్టవలసి వస్తే అలాగే కానిద్దాం” అన్నారు.
జెన్నా తన ఆలోచన చెప్పగానే, షేర్సింగ్ చాలా సంతోషించారు. “గొప్పగా ఉంది మంత్రిగారూ, అద్భుతమైన ఆలోచన. ఇది ఎంతో వినోదాత్మకంగా ఉండటమే కాదు, మా ప్రతిపక్షం సైతం తగిన విధంగా ప్రతిస్పందిస్తుంది.”
వారి ప్లాన్ ప్రకారం షేర్సింగ్ అతి పెద్ద విమర్శకుడైన జంపీ కోతిని “ఒక రోజు రాజు"గా ప్రకటించారు.సాధారణంగా జంపీ తాను ఒక రోజు రాజు అయితే చంపకవనం పూర్తిగా మారుస్తానని తరచూ చెబుతుండేవాడు.
మహారాజు ప్రకటన విని ప్రజలు జంపీని అభినందించడానికి అతని ఇంటికి రాసాగారు. జనంలో ఉన్నప్పుడు హుందాతనం ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడు జంపీ.సుగంధభరిత సబ్బుతో రుద్ది నోరు కడుక్కున్నాడు.తర్వాత తన తడి ముఖానికి బాగా పౌడర్ రాసుకున్నాడు.
This story is from the January 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మోసం
మోసం
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
జీవిత చక్రం
సీతాకోకచిలుక జీవిత చక్రానికి సంబంధించిన దశల ప్రకారం చిత్రాల పక్కన నంబర్ రాయండి.
ప్రకృతిపై ప్రేమ
ఆదిత్యకు మొక్కలు, ప్రకృతిపై అపారమైన ప్రేమ. అతడు తన తోటలో చాలా మొక్కలు నాటాడు.
మన - వాటి తేడా
ప్రస్తుతం మణిపూరి పొనీల మొత్తం సంఖ్య కేవలం 1000 నుంచి 2000 వరకే ఉంటుందని అంచనా.
పండ్ల దుకాణం
రెనిల్ రైతు దుకాణం నుంచి 3 వస్తువులు తీసుకోవాల్సి ఉంది. ఇక్కడి కూని చదివి అవేమిటో గుర్తించండి.
తేడాలు గుర్తించండి
మార్చి 14 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్.
తాతగారు – 'పై' డే
రియా రాహుల్ లెక్కల ప్రశ్నలకు జవాబులు రాసుకుంటున్నారు.
మీ ప్రశ్నలకు ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు. ఆమె ఇక్కడ పక్షులు, జంతువుల గురించి మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. దీంతో మీరు చుట్టూ ఉన్న పశు పక్షులు, ప్రకృతిని స్నేహ పూర్వకంగా సంరక్షించగల్గుతారు.
బొమ్మను పూర్తి చేయండి
దండి సత్యాగ్రహం ప్రారంభమైన తేదీ మార్చి 12.