అవసరానికి మించి మీరు భోజనం చేస్తున్నారా? తక్కువగా తిని తర్వాత పశ్చాత్తాప పడుతున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే...
38 సంవత్సరాల నళిని బొటిక్ నడుపుతూ ఉండేది. కరోనాకు ముందు ఆమె పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేది. కానీ కరోనాతో ఆమె వ్యాపారం చాలా దెబ్బ తిన్నది. షాపును అమ్మాల్సి వచ్చింది.
అయితే షాపు అమ్మడం వల్ల నళిని తీవ్ర ఒత్తిడికి గురైంది. ప్రతి చిన్న విషయానికి భర్తతో గొడవ పడింది. ఫలితంగా ఆమెలో ఓపిక నశించి పోయింది. ఇంట్లో ఉన్న కారణంగా ఆమె డైటింగ్ పాటర్న్ మారిపోయింది. ఒకప్పుడు 55 కిలోల బరువు ఉండే ఆమె 85 కిలోలకు చేరింది.
ఒత్తిడికి గురైనప్పుడు ఆమె బయటి నుంచి ఏదో ఒకటి ఆర్డరు చేసి తెప్పించుకుని తినేది.దీంతో తన స్ట్రెస్ కొంతమేర తగ్గుతుందని ఆమెకు అనిపించేది. అద్దంలో చూసుకుని తనను తాను అసహ్యించుకునేది. కరోనా కారణంగా ఆమె వ్యాపారం ఆగిపోవడంతో ఆమెలో ఆందోళన రుగ్మత చోటు చేసుకుంది. దాంతో ఆమె తినే అలవాటు దారి తప్పింది. సెల్ఫ్ ఇమేజ్ గురించి ఆందోళన చెందింది.
ఎమోషనల్ ఈటింగ్ అంటే ఏమిటి?
ప్రతికూల భావోద్వేగాలను అధిగమించడానికి తరచుగా ఎక్కువగా తినే అలవాటును ఎమోషనల్ ఈటింగ్ అంటారు. కొన్నిసార్లు అర్థరాత్రి ఆకలి అనిపించినప్పుడు ఫ్రిజ్లో ఆహారం కోసం వెతుకుతారు. అవి దొరక్కపోతే పిజ్జా, బర్గర్, పాస్తా లాంటివి ఆర్డర్ చేస్తారు.
చాలాసార్లు మనుషులు కోపం, విచారం, భాగస్వామితో బ్రేకప్ లేదా మనసులో ' అర్థం లేని కారణంతో భయంతో ఏదో ఒకటి తింటారు.తర్వాత నేను ఇంత ఎందుకు తిన్నానా అని పశ్చాత్తాపపడతారు.
26 సంవత్సరాల దీక్ష డిగ్రీ పూర్తి చేసి నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం వెతుకు తోంది. ఇప్పటివరకు ఎక్కడా పని దొరకక పోవడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఇక తనకు ఉద్యోగం రాదు అన్న ప్రతికూల ఆలోచన ఆమెలో స్థిరపడిపోయింది. ఈ ఒత్తిడి కారణంగా ఆమె బయటి నుంచి పిజ్జా, పాస్తా, మెమోస్ లాంటి తెప్పించుకుని తినసాగింది. కడుపు నిండినా ఇంకా ఏదో తినాలనిపించేది. తిన్నాక తను ఎందుకు తిన్నానా అని బాధపడేది.
Diese Geschichte stammt aus der April 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.