చిరు వ్యాపారుల సిరుల ఫుడ్డు
Vaartha-Sunday Magazine|March 17, 2024
వీధి ఆహార వ్యాపారం..భారతీయ సమాజం అనేక అంశాలు అనగా ఆహారం, సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానం, పండుగలు, వేషధారణలు, కట్టుబాట్లు, భాష మొదలైన వాటిలో విభిన్నంగా ఉంది.
కాళంరాజు వేణుగోపాల్
చిరు వ్యాపారుల సిరుల ఫుడ్డు

కాలానుగుణంగా ఈ వైవిధ్యం మార్పుకు లోను అవుతూ అభివృద్ధి చెందుతూనే ఉంది. స్వాతంత్య్రా నంతరం మారిన ఆర్థిక సరళీకృత విధానాల ద్వారా 21వ శతాబ్దంలో ఆ మార్పులు చాలావేగంతో జరిగాయి, జరుగుతు న్నాయి.అయితే మారుతున్న జీవన విధానం, ఆలోచనల సరళిలో చెప్పుకోదగిన పెద్ద మార్పు మన ఆహారపు అలవాట్లే. 1990వ దశకంలో సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ దశలో భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న పైతరగతి వర్గం మొదటి నుండి ఆహార ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణలో ఉన్న సమయంలో ఫాస్ట్ఫుడ్స్, జంక్ఫుడ్స్ రూపంలో ఈ ప్రత్యామ్నాయాలను అందించడానికి బహుళజాతి సంస్థలకు అప్పటి ప్రభుత్వాలు తలుపులు తెరిచాయి.

దీనిఫలితంగా అనేక ఫుడ్సెంటర్ రిటైల్ చైన్లు తమ అవుట్లెట్లను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో చాలామంది శీతల పానీయాలు పరిశ్రమలో పెట్టుబడి పెట్టగా, మరికొందరు చాక్లెట్లు, బిస్కెట్లు, నూడుల్స్ మొదలైన వాటిపై శ్రద్ధ పెట్టారు. అదేసమయంలో మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాలకు అందిన ప్రయోజనాలతో కొంత ఆర్థిక స్థిరత్వం, ఉపాధి అవకాశాలు, మారిన జీవన విధానంలో వారిలో కొత్తదనం పట్ల కొంత ఆసక్తి, చిన్న కుటుంబాలుగా విడిపోవడం, నూతన అభిరుచులు ఏర్పడడం, చదువులు,ఉద్యోగం, ఉపాధి కొరకు దూరాభారాలు ప్రయాణం చేయడం లాంటి అవసరాలు ఏర్పడడం, సోషల్ మీడియా ప్రభావం వలన కొత్తకొత్త రుచులు, వంటలు తెలుసుకోవడం వాటిని అందుకోవాలనే ప్రయత్నంలో పోటీ పడడంలో భాగంగా ఆహార పరిశ్రమ ఎన్నడూ లేనిరీతిలో కొత్తపుంతలు తొక్కి విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆ క్రమంలో మధ్యతరగతి, దిగువ తరగతుల పుణ్యమా అని స్ట్రీట్ఫుడ్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది.అలాంటి స్ట్రీట్ఫుడ్ గురించి ఈవారం తెలుసుకుందాం ఉదయం పూటో,ఉదయం పూటో, సాయంత్రం సమయాల్లో అలాఅలా వీధుల్లోంచి వెళుతుంటామా ఘుమఘుమలాడే మసాలా ఆ దోశనో, ఇంతెత్తున పొంగిన వేడివేడి పూరీల ప్లేటో, దంచికొట్టే బజ్జీల వాసనో, కమ్మని పకోడీ వాసనో, లేదంటే నోరూరించే జిలేబినో.. రా రమ్మనే సమోసానో, మనసును ఊదరకొట్ట పఫ్ , హుషారు తెప్పించే నూడుల్స్ ఏదో ఒకటి అలా కనిపిస్తే ఇలా బండిని పక్కన పెట్టేసి పటు పట్టాలనిపిస్తుంది.అవును కదూ..

هذه القصة مأخوذة من طبعة March 17, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة March 17, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ప్రపంచం లోని అతి పెద్ద రెస్టారెంట్ ఇది. చైనాలోని చాంగ్కింగ్ పట్టణంలో వుంది.

time-read
1 min  |
June 02, 2024
ఈ వారం కార్ట్యూన్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time-read
1 min  |
June 02, 2024
2 జూన్ నుండి 8, 2024 వరకు
Vaartha-Sunday Magazine

2 జూన్ నుండి 8, 2024 వరకు

వారఫలం

time-read
2 mins  |
June 02, 2024
ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?
Vaartha-Sunday Magazine

ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?

వాస్తువార్త

time-read
2 mins  |
June 02, 2024
దారి చూపే రామాయణం
Vaartha-Sunday Magazine

దారి చూపే రామాయణం

పదకొండు సెప్టెంబరు, 1893 రోజు చికాగోలో ప్రపంచ సర్వ మత సమావేశంలో హిందూ భారత హృదయాన్ని ఆవిష్కరించిన స్వామి వివేకానంద ప్రసంగం అంతే ప్రాధాన్యం పొందిన తేదీగా 22 జనవరి, 2024న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

time-read
1 min  |
June 02, 2024
నీటి వంతెనలు చూడతరమా!
Vaartha-Sunday Magazine

నీటి వంతెనలు చూడతరమా!

సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.

time-read
4 mins  |
June 02, 2024
సిండరిల్లా
Vaartha-Sunday Magazine

సిండరిల్లా

సింగిల్ పేజీ కథ

time-read
2 mins  |
June 02, 2024
నాదస్వరానికి చిరునామా
Vaartha-Sunday Magazine

నాదస్వరానికి చిరునామా

నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం\" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం \"3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.

time-read
1 min  |
June 02, 2024
చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర
Vaartha-Sunday Magazine

చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర

కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి, వాళ్ల గుండెల మీద ముద్ర పడేలా రాయి. వాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే చెప్పు\" అంటారు మహాకవి శేషేంద్ర.

time-read
2 mins  |
June 02, 2024
నవ్వుల్ ...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్ ...రువ్వుల్...

నవ్వుల్ ...రువ్వుల్...

time-read
1 min  |
June 02, 2024